చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలితతో బాబు సంప్రదింపులు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చెన్నై: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం అన్నాడియంకె నేత జయలలితతో ఫోన్ లో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే తృతీయ కూటమి సమావేశానికి రావాల్సిందిగా ఆయన జయలలితను కోరారు. ఆమె ఈ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆమె ఈ నెల 18వ తేదీన ఆమె ఢిల్లీలో ఉంటారు.

సిపిఐ, సిపిఎం నాయకులు కూడా జయలలితను తరుచుగా సంప్రదిస్తున్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆమెతో ఫోనులో మాట్లాడారు. ఏ కూటమితో ఉంటాననే విషయం స్ఫష్టం చేయకపోవడంతో ఆమెను సంప్రదించే నాయకుల సంఖ్య పెరిగింది. బిజెపి నాయకులు జయలలిత మద్దతు పొందడానికి తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. జయలలితతో సంధి చేసుకునే ప్రయత్నాలను బిజెపి అగ్రనేతలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అప్పగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X