హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లికి వెళ్లి వచ్చే లోగా ఇల్లు గుల్ల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పెళ్లికి వెళ్లి వచ్చేలోగా ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన హైదరాబాదు సమీపంలోని పటాన్‌ చెరులో చోటుచేసుకుంది. పటాన్ చెరులో నివసించే ఆకుల రాజయ్య కుటుంబ సభ్యులు సంగారెడ్డిలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసే సరికి ఇంటిలో చోరీ జరిగింది.

ఈ లోగా గుర్తు తెలియని దుండగులు తలుపులు పెకలించి ఇంట్లో చొరబడి 50 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. ఇటీవలే వాటిని బ్యాంకు నుంచి తీసుకుని వచ్చామని, విషయం తెలిసినవారే చోరీకి పాల్పడి ఉంటారని రాజయ్య అనుమానం వ్యక్తం చేశారు. పటాన్‌ చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X