వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తారలు తేలిపోయిన వేళ

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్‌: ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఎన్నికల్లో సినిమా ప్రముఖులు పెద్దగా రాణించలేదు. మొత్తం 20 మంది సినీ ప్రముఖులు ఎన్నికల బరిలో నిలవగా ఆరుగురే గెలుపొందారు. సామాజిక న్యాయం నినాదంతో నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తామని రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి రెండు స్థానాల్లో పోటీ చేశారు. వాటిలో తిరుపతి నుంచి గెలుపొందగా, పాలకొల్లులో ఓడిపోయారు. చిత్తూరు పార్లమెంటు స్థానానికి తెదేపా తరఫున పోటీచేసిన సినీనటుడు శివప్రసాద్‌ విజయం సాధించారు. కథానాయికల్లో జయసుధ సికింద్రాబాద్‌ శాసనసభ స్థానం నుంచి గెలిచారు. మెదక్‌ లోకసభ స్థానానికి పోటీ చేసిన విజయశాంతి కూడా గెలుపొందారు. చంద్రగిరి నుంచి తెదేపా తరఫున పోటీచేసిన రోజాకు నిరాశే మిగిలింది.

ప్రరాపాలో అన్నీ తానై వ్యవహరించిన చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌ అనకాపల్లిలో ఓడిపోయారు. రాజమండ్రి లోకసభ స్థానానికి పోటీ చేసిన సినీనటులు మురళీమోహన్‌(తెదేపా), కృష్ణంరాజు(ప్రరాపా)లు కూడా పరాజయం పాలయ్యారు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా నిర్మిస్తున్న వంశీమోహన్‌కృష్ణ తెదేపా తరఫున విజయవాడ పార్లమెంటు స్థానంలో బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. ఏలూరు లోకసభ స్థానానికి పోటీచేసిన సినీ నిర్మాత, తేదేపా అభ్యర్థి మాగుంట బాబుదీ అదే దారి. ఏలూరు అసెంబ్లీ స్థానంలో తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన మరో సినీ నిర్మాత అంబికాకృష్ణ కూడా ఓటమిపాలయ్యారు.

గుడివాడలో తేదేపా అభ్యర్థి, సినీ నిర్మాత కొడాలి నాని మంత్రి పిన్నమనేనిపై విజయం సాధించారు. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రరాపా తరఫున పోటీ చేసిన సినీ నిర్మాత, నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఓటమిపాలయ్యారు. మెదక్‌ జిల్లా ఆంథోల్‌ నుంచి పోటీ చేసిన బాబూమోహన్‌ మరోసారి ఓడిపోయారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట బరిలో నిలిచిన తేదేపా అభ్యర్థి, సినీ నిర్మాత చెంగల వెంకట్రావు పరాజితులయ్యారు. కాకినాడ లోకసభ స్థానం నుంచి ప్రరాపా తరఫున పోటీ చేసిన సినీ నిర్మాత చెలమశెట్టి సునీల్‌ ఓటమిపాలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X