హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ గెలిచేవారా: నాగం ప్రశ్న

By Staff
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తాము సహకరించి ఉండకపోతే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు గెలిచి ఉండేవారా అని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. తమకు తెలుగుదేశం పార్టీ సహకరించలేదనే కెసిఆర్ విమర్శలను ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. తాము మహా కూటమి ధర్మాన్ని పాటించామని ఆయన చెప్పారు.

ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించుకోవాలి తప్ప ఇతర పార్టీలపై నిందలు వేయడం సరి కాదని ఆయన కెసిఆర్ కు సూచించారు. ఉప ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ స్థానంలో 20 వేల ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో 60 వేల ఓట్లు వచ్చాయని, ఇన్ని ఓట్లు తాము సహకరించకపోతే ఎలా వస్తాయని ఆయన అన్నారు. తమ ధర్మాన్ని తాము నిర్వహించామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X