రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మెదక్ జిల్లా రిమ్మనగూడ వద్ద ఓ వంతెనపై కారును లారీ ఢీకొనటంతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా లింగన్నపేట నుంచి ఓ కుటుంబం కారులో వస్తుండగా వంతెనపై వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో కారులోని భార్యాభర్తలు, ఓ చిన్నారి మృతి చెందారు. మరో ప్రమాదం గుంటూరు జిల్లాలో జరిగింది. దుర్గి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెంటచింతల ఏఎస్ ఐ సుధాకర్ మృతి చెందారు.
Comments
Story first published: Wednesday, May 20, 2009, 15:40 [IST]