హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై టిడిపి పునరాలోచన

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ అంశంపై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినందు వల్ల పార్టీ నష్టపోయిందనే అభిప్రాయం బలపడుతోంది. తెరాసతో పొత్తు వ్యతిరేక ఫలితాలు ఇచ్చిందని, తెలంగాణపై పునరాలోచన చేయాల్సి ఉందని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు.

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నష్టపోయిందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కోస్తాలో 123 శాసనసభా స్థానాలుండగా తెలుగుదేశం పార్టీకి 36 స్థానాలు మాత్రమే వచ్చాయి. రాయలసీమలో 52 స్థానాలుండగా 16 స్థానాలు మాత్రమే తెలుగుదేశం గెలుచుకోగలిగింది.

తెలంగాణలో కూడా పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం ఉంది. తాము గెలుచునే సీట్లను కూడా మిత్రపక్షాలకు వదిలిపెట్టాల్సి వచ్చిందని, దాని వల్ల పెద్ద నష్టమే జరిగిందని అంటున్నారు. మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ సరిగా జరగకపోవడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X