వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రుల పట్టు: పిఎం భేటీ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: మంత్రివర్గ కూర్పుపై మిత్రపక్షాలతో బేరసారాలు ఒక కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తో ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ వాయిదా పడింది. ఆయన గురువారం ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్రపతిని కలిసి తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాను అందజేయాల్సి ఉంది. అయితే మంత్రివర్గం కూర్పుపై మిత్రపక్షాలతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రధాని రాష్ట్రపతితో భేటీని వాయిదా వేసుకున్నారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే మిత్రపక్షాలు కీలకమైన మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఎక్కువ మంత్రి పదవులను ఆశిస్తున్నాయి. దీంతో సోనియా గాంధీతో చర్చించి తదుపరి కార్యక్రమాన్ని ప్రధాని ఖరారు చేసుకుంటారు. డిఎంకె 9 మంత్రి పదవులను డిమాండ్ చేస్తుండగా, డిఎంకెకు ఇచ్చే మంత్రి పదవుల కన్నా ఒక్కటి ఇవ్వాలని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది.

ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధులు డిఎంకె నేత కరుణానిధితో జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ప్రణబ్ ముఖర్జీ బృందం మరోసారి గురువారం కరుణానిధితో సమావేశం కానుంది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X