భయపడేది లేదు: తెలుగుదేశం
హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు చూసి ఓడిపోయేది లేదని, నిరుత్సాహ పడేది కూడా లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్ గజపతి రాజు, కెఇ కృష్ణమూర్తి, నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టిడిఎల్పీ) సమావేశానంతరం వారు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని వారు చెప్పారు. కాంగ్రెసు పార్టీ కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో గెలిచిందని, అది కాంగ్రెస్ అదృష్టమని వారు అభిప్రాయపడ్డారు. ప్రలోభాలకు లొంగకుండా తమ పార్టీ నాయకులు పని చేయాల్సి ఉంటుందని, చేస్తారని ఆయన అన్నారు. ఎన్నికల్లో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటామని వారు చెప్పారు.
రాష్ట్రంలో రెండు పార్టీల లేదా కూటముల వ్యవస్థ రూపుదిద్దుకునే పరిస్థితులున్నాయని వారు చెప్పారు. తమ ఫలితాలపై లోకసత్తా, ప్రజారాజ్యం పార్టీలు ప్రభావం చూపాయని వారన్నారు. 24 సీట్లలో లోకసత్తా వల్ల తమకు నష్టం జరిగిందని వారన్నారు. ప్రజారాజ్యం పార్టీ ప్రభావం కూడా తమపై పడిందని వారు చెప్పారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లోని పరిస్థితిని మరోసారి సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. కాంగ్రెసుకు గతంలో కన్నా సీట్లు తగ్గాయని వారన్నారు. తెలుగుదేశం ఓటమికి కలత చెందిన ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తుల కుటుంబాలను ఆదుకుంటామని వారు చెప్పారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..!












Click it and Unblock the Notifications