హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాపై డీజీపీ చిర్రుబుర్రులు

By Staff
|
Google Oneindia TeluguNews

SSP Yadav
హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఎస్పీ యాదవ్‌ మీడియాపై చిర్రుబుర్రులాడారు. తనపై మీడియా కావాలని ఆరోపణలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మళ్లీ పదవిలోకి వస్తానని తెలుసునని చెప్పారు. సింగపూర్‌ ప్రభుత్వం ఆహ్వానిస్తేనే అక్కడకు వెళ్లానన్నారు. ఇడుపులపాయ సందర్శించడానికి వెళ్లానని చెప్పుకున్నారు. ప్రతి అధికారి ప్రభుత్వానికి విధేయుడిగా ఉండాలని, తానూ అదే చేశానని అన్నారు.

ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించడంతో ఆయనను ఎన్నికల కమిషన్ పదవి నుంచి తప్పించింది. డిజిపిగా ఆయన స్థానంలో మహంతిని నియమించింది. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే మహంతిని తొలగించి తిరిగి ఎస్ ఎస్పీ యాదవ్ ను డిజిపిగా నియమించారు. ఆయన శుక్రవారం తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X