చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రమాణ స్వీకారానికి డిఎంకె డుమ్మా

By Staff
|
Google Oneindia TeluguNews

Karunanidhi
న్యూఢిల్లీ: ప్రధానిగా మన్మోహన్ ప్రమాణ స్వీకారోత్సవానికి డిఎంకె హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. మంత్రి పదవుల విషయంలో కాంగ్రెసుకు, డిఎంకెకు మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తాము ప్రభుత్వంలో చేరబోమని డిఎంకె గురువారం రాత్రి ప్రకటించింది. అలక వహించిన డిఎంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి శుక్రవారం ఉదయం చెన్నైకి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు.

డిఎంకెతో ఏర్పడిన ప్రతిష్టంభనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో శుక్రవారం తెల్లవారు జామున చర్చలు జరిపారు. డిఎంకె చర్చలు కొనసాగించాలని వారు నిర్ణయించుకున్నారు. గురువారం అర్థరాత్రి సమయంలో కూడా మన్మోహన్ సింగ్ కరుణానిధితో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఉండడంతో టిఆర్ బాలు, ఎ. రాజాలను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి కాంగ్రెసు ఇష్టపడడం లేదు. అయితే వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని కరుణానిధి పట్టుబడుతున్నారు. మన్మోహన్ సింగ్ శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X