వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర కేబినెట్ లోకి జైపాల్ రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
న్యూఢిల్లీ‌: ప్రధానిగా మన్మోహన్ సింగ్ తో పాటు శుక్రవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే కొద్ది మందిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎస్ జైపాల్ రెడ్డి పేరు ఉంది. ఎస్ జైపాల్ రెడ్డి చేవెళ్ల నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. గత మంత్రివర్గంలో కూడా జైపాల్ రెడ్డి ఉన్నారు. జైపాల్ రెడ్డికి శుక్రవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీల నుంచి పిలుపు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కిశోర్ చంద్రదేవ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పూర్తిగా నిర్ధారణ కాలేదు. డిఎంకెతో పేచీ రావడంతో శుక్రవారంనాడు కొద్ది మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. విస్తరణలో రాష్ట్రానికి చెందిన మరి కొంత మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X