వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ దేశాధ్యక్షుని ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

Roh Moo Hyun
సియోల్‌: అవినీతి ఆరోపణ ఎదుర్కొన్నందుకు సిగ్గుపడి సాక్షాత్తు ఓ మాజీ దేశాధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్న విచిత్ర దక్షిణ కొరియాలో శనివారం జరిగింది. కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్‌ మూ-హ్యూన్‌ శనివారం ఉదయం ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ఓ పర్వతం మీద ఎక్కి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అవినీతికి పాల్పడి ప్రజలను మోసగించినందుకు తాను సిగ్గుపడుతున్నానని, ప్రజలకు తన మొహం చూపలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, ప్రజలు తనను క్షమించాలని 62 ఏళ్ల రోహ్‌ ఓ మరణవాంగ్మూలం కూడా రాశారు.

మానవహక్కుల లాయర్‌గా పేరుగాంచిన రోహ్‌ 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా పనిచేశారు. క్లీన్‌ పొలిటీషియన్‌ గా ఆయన పేరుపొందారు. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో అధ్యక్షుడు ప్రచారం చేయరాదన్న నిబంధనను ఉల్లంఘించినందుకు సభ ఆయనపై అవిశ్వాసతీర్మానం పెట్టి పదవినుంచి దించివేసింది. అనంతరం కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ఓ సారి దేశంలోని ఓ వ్యాపారవేత్తనుంచి లంచం తీసుకున్నారని ఆయన పదవినుంచి దిగిపోయిన అనంతరం ఆరోపణ వచ్చింది. దీంతో ఆయనను కోర్టు విచారిస్తోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఆయన తీవ్ర అవమానానికి, ఆత్మక్షోభకు గురయ్యారు. శనివారం ఉదయం 8.30కు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X