హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కేసు
హైదరాబాద్: హైదరాబాదులో మరో స్వైన్ ఫ్లూ కేసు బయట పడింది. స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చిందనే అనుమానంతో ఒక మహిళను శుక్రవారం హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎస్వీ ప్రసాద్ చెప్పారు. ఈ ఆస్పత్రిలో బయట పడిన రెండో స్వైన్ ఫ్లూ కేసు ఇది. అంతకు ముందు చేరిన రోగి పరీక్షల నివేదిక కోసం నిరీక్షిస్తున్నట్లు ప్రసాద్ చెప్పారు.
జ్వరం, జలుబు ఉండడంతో మహిళను ఆస్పత్రిలో చేర్చారు. వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను ఢిల్లీలోని కమ్యూనికేబుల్ డీసీజెస్ జాతీయ సంస్థకు పంపినట్లు ప్రసాద్ శనివారంనాడు చెప్పారు. చికిత్స పూర్తయితే మొదటి రోగిని శనివారం డిశ్చార్జీ చెస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, May 23, 2009, 12:35 [IST]