హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జానా, జెసిలకు వైయస్ మొండిచెయ్యి

By Staff
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్‌: గత మంత్రి వర్గంలో ఉన్న ఐదుగురు సీనియర్ మంత్రులకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం లేదు. నల్లగొండ జిల్లాకు చెందిన కె.జానారెడ్డికి, రాంరెడ్డి దామోదర్ రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కడం లేదు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కుతోంది. కాగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ పంచాయతీ రాజ్ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి కూడా వైయస్ తన మంత్రివర్గంలో స్థానం చోటు కల్పించడం లేదు. మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా మంత్రి వర్గంలో చేరే అవకాశం లేదు.

పూర్తిగా తనకు అనుకూలురైన శాసనసభ్యులతో వైయస్ తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తన మంత్రి వర్గంలోకి 35 మందిని తీసుకుంటున్నారు. దాంతో మంత్రి విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం కూడా లేదు. కిరణ్ కుమార్ రెడ్డిని శాసనసభ స్పీకర్ గా, నాదెండ్ల మనోహర్ ను డిప్యూటీ స్పీకరుగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కడం లేదు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ కింది వారికి మంత్రి పదవులు ఖరారయ్యాయి.

పార్థసారధి
వట్టి వసంతకుమార్
రోశయ్య
కన్నా లక్ష్మినారాయణ
మోపిదేవి వెంకటరమణ
కోమటి రెడ్డి వెంకటరెడ్డి
శిల్పా మోహన్ రెడ్డి
జూపల్లి కృష్ణారావు
దానం నాగేందర్
సిబితా ఇంద్రారెడ్డి
బొత్సా సత్యనారాయణ
ధర్మాన ప్రసాదరావు
శత్రుచర్ల విజయరామరాజు
పి. బాలరాజు
పితాని సత్యనారాయణ
గల్లా అరుణ కుమారి
డికె అరుణ
రఘువీరా రెడ్డి
సునీతా లక్ష్మారెడ్డి
పిల్లి సుభాష్ చంద్రబోస్
పి.రామచంద్రారెడ్డి
దామోదరం రాజనర్సింహ
అహ్మదుల్లా
రాంరెడ్డి వెంకటరెడ్డి
శ్రీధర్ బాబు
పొన్నాల లక్ష్మయ్య
సుదర్శన్ రెడ్డి
ఆనం రాంనారాయణ రెడ్డి
కొండా సురేఖ
ముఖేష్
గీతారెడ్డి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X