చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పదవికి కనిమొళి దూరం

By Staff
|
Google Oneindia TeluguNews

Kanimozhi
చెన్నై: డిఎంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చేరకపోవచ్చు. కేబినెట్ ర్యాంక్ గానీ, సహాయ మంత్రిగా ఇండిపెండెంట్ చార్జీ గానీ ఇచ్చేందుకు మన్మోహన్ సింగ్ సిద్ధంగా లేకపోవడంతో ఆమె మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గంలో ఆమె చేరుతుందని అనుకోవడం లేదని కనిమొళి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎంకె అళగిరి, ఎ.రాజా, దయానిధి మారన్ లను కేబినెట్ మంత్రులుగా తీసుకుంటున్నందున ఆమెకు ఆ హోదా లభించే అవకాశాలు లేవు. దీంతో కనిమొళి మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంగళవారం ప్రమాణ స్వీకారం చేయడానికి అళగిరి, దయానిధి మారన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X