తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ ప్రక్షాళనకు చిరు రెడీ

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఎన్నికల్లో వైఫల్యం ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవిని ఆత్మపరిశీలనలో పడేసింది. దీంతో ఆయన ప్రజారాజ్యం పార్టీ ప్రక్షాళనకు పూనుకుంటున్నారు. జిల్లాలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆయన తలపెట్టారు. శాసనసభ సమావేశాల తర్వాత ఆయన ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు .పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలను ఆయన చేపడతారు.

వెన్నుపోటు పొడిచినవారిని గుర్తించి పార్టీని ప్రక్షాళనం చేయడానికి చిరంజీవి కసరత్తు చేస్తున్నట్లు ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి రామచంద్రయ్య అన్నారు. పార్టీని మోసం చేసినవారికి కొత్త కమిటీల్లో స్థానం లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. ఈ నెలాఖరున చిరంజీవి తిరుపతిలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయన తిరుపతిలో పర్యటించే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X