హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిఆర్పీ నేతలకు బాబు గాలం?

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరిన సీనియర్లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. నేతలు వెళ్లినా కార్యకర్తలు తమ వెంటే ఉంటారని చెబుతూ వచ్చిన చంద్రబాబు సీనియర్లు వెళ్లిపోవడం వల్ల ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పసి గట్టారు. దీంతో వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే నేరుగా మహానాడు ద్వారా పిలుపు నివ్వాలా, వ్యక్తిగతంగా ఆహ్వానం పలుకాలా అనే విషయంలో ఆయన మీమాంసకు గురవుతున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.దేవేందర్ గౌడ్, ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాం, కళా వెంకట్రావు, ఘంటా శ్రీనివాసరావు, గోదావరి జిల్లాలకు చెందిన కోటగిరి విద్యాధర రావు, రాయలసీమకు చెందిన భూమా నాగిరెడ్డి తదితర నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాల పట్ల వారు విసిగి ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాము వారిని తీసుకోవడానికి సుముఖంగా ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

బుధవారం జరుగుతున్న మహానాడులో తమ పార్టీ వైఖరిని తేటతెల్లం చేయడం ద్వారా, తమ శక్తి ఉడిగిపోలేదని చాటుకోవడం ద్వారా ఇతర పార్టీలకు వలస వెళ్లిన వారిని తీసుకునేందుకు సంకేతం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X