హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇజ్రాయెల్‌ కు బయలుదేరిన వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌, మే 27: ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబ సమేతంగా ఇజ్రాయెల్‌ పర్యటనకు బుధవారం ఉదయం ప్రయాణమయ్యారు. మంగళవారం సాయంత్రమే ఈ పర్యటన ఖరారైంది. అయితే వారు ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానం ఇండియాకు రావడం ఆలస్యం కావడంతో బుధవారానికి పర్యటన వాయిదా పడింది.

ఐదు రోజుల ఆయన పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి కూడా లభించింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెం, బెత్లెహామ్‌, నజరేత్‌, గాలిలీని సందర్శించనున్నారు. సీఎంతో పాటు ఆయన ముఖ్య భద్రతాధికారి ఎం.రమేష్‌, భద్రతాధికారి సాల్మన్‌ కారీ వెస్లే, ఎస్పీ స్టీఫెన్‌ రవీంద్రలు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన హైదరాబాదుకు తిరిగి వస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X