తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరూ వెనక్కి వెళ్లిపోరు: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుమల: తమ పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల నాయకుల్లో ఎవరు కూడా తిరిగి వెనక్కి వెళ్లబోరని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. రెండు రోజుల పాటు తిరుపతి శాసనసభా నియోజక వర్గంలో పర్యటన నిమిత్తం ఆయన గురువారం ఇక్కడికి వచ్చారు. వారంతా తమ పార్టీకి అనుకూలంగానే ఉన్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

తిరుమలేశుని, తిరుపతి ప్రజల దయ వల్లనే తాను విజయం సాధించానని ఆయన చెప్పుకున్నారు. పార్టీ పటిష్టతపై తాము దృష్టి పెడతామని ఆయన చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు అన్ని విధాలా సేవలందిస్తానని ఆయన చెప్పారు. తనను తిరుపతి ప్రజలు గెలిపించడం అదృష్టంగా భావిస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X