బావిలో బస్సు: 15మందికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవాపురం వద్ద ఆర్టీసీ బస్సు పాడుబడిన బావిలో పడటంతో 15 మంది గాయపడ్డారు. హైదరాబాద్నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పాడుపడిన బావిలో పడింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. అందులో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Comments
Story first published: Saturday, May 30, 2009, 11:55 [IST]