హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం సిబ్బంది కోతకు ప్లాన్

By Staff
|
Google Oneindia TeluguNews

Satyam Computers
హైదరాబాద్‌: సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ లోని అదనపు ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళిక తయారైంది. సత్యంలో 10 వేల మంది ఉద్యోగులు అదనంగా ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. ఆదాయం సమకూర్చని ఉద్యోగుల జాబితాను సత్యం కొత్త యాజమాన్యం టెక్‌ మహీంద్రా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే కంపెనీ వీరిపై ఒక్కసారిగా వేటు వేయకుండా ఆరునెలలపాటు ఓ ప్యాకేజీని అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ పది వేల మంది అందుకుంటున్న జీతంలో ఆరు నెలల పాటు 40 శాతమే జీతాన్ని చెల్లించాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కాలంలో వీరు వైద్య బీమాతోపాటు ప్రావిడెంట్‌ ఫండ్‌ ను కూడా అందుకుంటారు. ఆరు నెలల తరువాత వీరంతా కంపెనీని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగుల తొలగింపు అన్ని స్థాయిలలో ఉంటుంది. అయితే పై, మధ్య స్థాయి ఉద్యోగులను ఎక్కువగా తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రాజెక్టులు లేకుండా బెంచ్‌ మీద ఉన్న సిబ్బందితో పాటు మార్కెటింగ్‌ విభాగంలో కూడా ఉద్యోగుల కోత ఉంటుందని చెబుతున్నారు.

రాబడిని అధికం చేసి చూపించడానికి పాత చైర్మన్ రామలింగరాజు అవసరానికి మించి ఉద్యోగులను తీసుకున్నారని, ఇప్పుడు ఆ కేటగిరీకి చెందిన వారినే ఉద్యోగాల నుంచి తొలగించాలని టెక్‌ మహీంద్రా భావిస్తోంది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్తగా వేరే సంస్థలో ఉద్యోగ అవకాశాలకోసం డజను ఔట్‌ప్లేస్‌ మెంట్‌ సంస్థలతో కంపెనీ చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సత్యంలో 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తే వీరి సంఖ్య 32 వేలకు చేరుతుంది. దీని వల్ల కంపెనీపై భారం తగ్గుతుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X