హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగుదేశం దుష్ప్రచారం: చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: తెలుగుదేశం కావాలనే ప్రజారాజ్యం పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని చిరంజీవి తమ నేతలుతో అన్నారని సమచారం. వచ్చే ఎన్నికల నాటికి ప్రజారాజ్యం, లోక్‌ సత్తా పార్టీలు బలోపేతమయితే తమకు నష్టమని భావించిన తెలుగుదేశం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని కొందరు నేతలు చిరంజీవితో అన్నట్లు తెలిసింది.

అలాగే చంద్రబాబు తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన నేతలతో ఫోన్‌ మంతనాలు చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దేవేందర్‌ గౌడ్‌, శోభానాగిరెడ్డి మీడియాతో అన్నారు. అలాంటి ఫోన్‌లేవీ తమకు రాలేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ముఖ్యనేతలు తిరిగి వెళ్లిపోతే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతుందని, కార్యకర్తల్లో ఆత్మస్త్థెర్యం దెబ్బ తింటుందని సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఆదివారం చిరంజీవి తన నివాసంలో ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఐదు గంటలపాటు సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఆయన నివాసంలోనే మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. అరవింద్‌, దేవేందర్‌గౌడ్‌, కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం, భూమా నాగిరెడ్డి, సి.రామచంద్రయ్య, శోభా నాగిరెడ్డి, వేదవ్యాస్‌ తదితరులు పాల్గొన్నారు. 'వచ్చే అయిదేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి' అని చిరంజీవి కోరినట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X