హెలికాప్టర్ల తయారీ మనదే
హైదరాబాదు: రాష్ట్రంలో హెలికాప్టర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో ఈ భారీ హెలికాప్టర్ల తయారీ సంస్థ ఏర్పాటు కానుంది. అతిపెద్ద హెలికాప్టర్ గా పేరొందిన సైకార్కీని కూడా ఇక్కడే తయారీ చేసేందుకు టాటా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. వచ్చే సంవత్సరం జూన్ నాటికి హెలికాప్టర్ల తయారీ ప్రారంభం కావచ్చని అధికారులు చెప్తున్నారు. ఇందునిమిత్తం ప్రభుత్వం ఏపీఐఐసీ టాటా సంస్థకు 50 ఎకరాల భూమిని కేటాయించింది.
Comments
Story first published: Monday, June 1, 2009, 15:54 [IST]