వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచి లోక్ సభ సమావేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ఇటీవల ఎన్నికైన 15వ లోక్‌ సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తిరిగి అధికారం నిలబెట్టుకున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కొత్త ఇన్నింగ్స్‌ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతుండగా, 'నిర్మాణాత్మక ప్రతిపక్ష' పాత్ర పోషిస్తామని బీజేపీ చెబుతోంది. కొత్తగా ఎన్నికైన 543 మంది లోక్‌ సభ సభ్యుల ప్రమాణ స్వీకారంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. సోమవారం నుంచి బుధవారం వరకు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం లోక్‌ సభ స్పీకర్‌ ను ఎన్నుకుంటారు.

గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పార్లమెంటులోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం సమావేశమైన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ రాష్ట్రపతి ప్రసంగాన్ని ఖరారు చేసింది. ఈ ప్రసంగంలో సంక్షేమ పథకాలను బలోపేతం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రధానంగా దృష్టిసారించినట్టు చెబుతున్నారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల విధానాలు, వాగ్దానాలకు అనుగుణంగా రానున్న సంవత్సర కాలానికి ప్రభుత్వ అజెండాను ఆవిష్కరిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X