విమాన ప్రమాదంలో 228 మృతి

Air France
పారిస్‌: 228 మంది ప్రయాణీకులతో బ్రెజిల్‌ నుంచి పారిస్‌ బయలుదేరిన విమానం మాయమైంది. ఈ అదృశ్యం అయిన ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానం అట్లాంటిక్‌ సముద్రంలో కూలినట్లు అధికారులు ధృవీకరించారు. దాంతో ఈ విమానంలో 228 మంది ప్రయాణికులు చనిపోయినట్లే నని నిర్ణయించారు. బ్రెజిల్‌ వైమానిక, నావికా దళాలు రంగంలోకి దిగి విమాన శకలాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎఫ్‌ 447 పేరు గల ఈ విమానంలో 216 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.

రియో డీ జానిరియో విమానశ్రయం నుంచి ఆదివారం రాత్రి 7 గంటలకు బయలుదేరింది. అది పారిస్‌ లోని చార్లెస్‌ డిగాలే విమానాశ్రయంలో సోమవారం ఉదయం 11.15 గంటలకు దిగాల్సి ఉంది. అయితే ఆ విమానం నుంచి రేడియో సంకేతాలు అందకుండా పోయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ విమానం అట్లాంటిక్‌ మహాసముద్ర గగనతలంపై ప్రయాణిస్తుండగా, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయినట్లుగా తెలుస్తున్నది.

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి, ప్రయాణీకులందరికీ విద్యుదాఘాతం సంభవించి విమానం సముద్రంలో కూలిపోయి ఉండవచ్చునని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+