హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్..సువార్త సభల్లో

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: సువార్త సభల్లో కళ్లు లేని వారికి కళ్లు, కాళ్లు లేనివారికి కాళ్లు తెప్పిస్తామంటూ మతాధికారులు చెప్పే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన ఉందని విశ్వహిందూ పరిషత్ విమర్శించింది. జెరూసలెం వెళ్లి ప్రభువు దర్శనం చేసుకొని వచ్చినందునే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వీహెచ్‌ పీ రాష్ట్ర పశ్చిమ శాఖ ప్రధాన కార్యదర్శి తీవ్రంగా ఖండించారు.

జెరూసలెం వెళ్లి వచ్చినంత మాత్రాన వర్షాలు కురిసేటట్లయితే...పాలస్తీనా, ఇథియోపియా, ఇజ్రాయెల్‌ వంటి క్రైస్తవ దేశాల్లో కరువు ఎందుకు ఉందని విశ్వహిందూ పరిషత్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ ను సూటిగా ప్రశ్నించింది. కరువు కారణంగా జెరూసలెం ఎడారిగా మారిందని, వ్యవసాయానికి నీళ్లు సరిపోక అక్కడ బిందుసేద్యం చేస్తున్నారని, ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నారని గుర్తు చేసింది. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వాధినేత అయివుండి తన మత భావాలను ప్రజల మీద రుద్ది క్రైస్తవ మత ప్రచారం చేయడం శోచనీయమన్నారు. వైఎస్‌ ప్రకటనే నిజమైతే వందల కోట్ల రూపాయల ఖర్చుతో మేఘమథనం చేపట్టి కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం ఎందుకు చేశారని నిలదీశారు. మెజార్టీగా ఉన్న హిందువుల విశ్వాసాలను గాయపరిచే విధానాలు మానుకోవాలని హితవుపలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X