11 వరకు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈనెల 11 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. నిజానికి 5న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తివారీ ప్రసంగించాలి. ఆ రోజున టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతికి సంతాపాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో ఎనిమిదో తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
తొమ్మిది, పదో తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ రెండు రోజుల్లో శాసనమండలి సమావేశాలు కూడా జరుగుతాయి. ఈ సమావేశాలను 11వ తేదీ వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆఖరి రోజున ముఖ్యమంత్రి ప్రసంగంతో సభ ముగుస్తుందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి.
Comments
Story first published: Thursday, June 4, 2009, 12:03 [IST]