మక్కా మసీదు వద్ద ఇద్దరు అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని మక్కా మసీదు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బ్యాగుల్లోంచి 10 బ్యాటరీలు, వైర్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మక్కా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిఘాను పెంచారు.
నిఘా విభాగాల హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు నిఘాను పెంచడంతో వారిద్దరు పట్టుబడ్డారు. పోలీసులకు పట్టుబడిన ఇద్దరిలో ఒక వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కు చెందిన మెహబూబ్ గా గుర్తించారు. తమకు అదుపులో ఉన్న ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి 15 మంది ప్రవేశించారని మెహబూబ్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
hyderabad హైదరాబాద్ police karnataka కర్ణాటక muslim పోలీసులు mecca masjid raichur మక్కా మసీదు రాయచూర్
Story first published: Friday, June 5, 2009, 13:46 [IST]