ఏసీబీకి చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్
ఏలూరు: ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మూడో పట్టణ ఎస్సై రామారావు, కానిస్టేబుల్ మధు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీరిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.
ఓ కేసు నిమిత్తం 5వేల రూపాయలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
Comments
Story first published: Friday, June 5, 2009, 12:08 [IST]