వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో నాందేడ్ వాసుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌: మహబూబ్‌ నగర్‌ లోని భూత్‌ పూర్‌ మండలం పోతులమడుగు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు.

కర్నాటక రాష్ట్రం నాందేడ్‌ కు చెందిన వారు తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X