వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదంలో నాందేడ్ వాసుల మృతి
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ లోని భూత్ పూర్ మండలం పోతులమడుగు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు.
కర్నాటక రాష్ట్రం నాందేడ్ కు చెందిన వారు తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Story first published: Saturday, June 6, 2009, 14:12 [IST]