హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ తో దోస్తీ ఉత్తదే: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తమ పార్టీ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే వార్తల్లో నిజం లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. శాసనసభ స్పీకరును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తోందని, అందువల్లనే తాము కాంగ్రెసు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ని స్పీకరు పదవికి బలపరిచామని, అంతకు మించి అందులో తాము కాంగ్రెసుతో కలిసి పనిచేస్తున్నామని అనుకోవడానికి ఏమీ లేదని ఆయన ఒక ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

శాసనసభ సమావేశాల తొలి రోజు వాతావరణం చాలా బాగుందని, రెండో రోజే పరిస్థితి మారిపోయిందని, ఈ స్థితిలో తాను మాట్లాడాల్సి వచ్చిందని, దానికి మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు. ప్రజలు తీవ్రమైన మంచినీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నారని, ప్రజల ప్రధాన సమస్య ప్రస్తుతం మంచినీటి కొరతేనని, ఆ సమస్య పరిష్కారానికి శాసనసభలో తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X