హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్యపై కోర్టు మండిపాటు

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణపై కడప జిల్లా కోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆయనను కోర్టు ఆదేశించింది. కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై బాలయ్యపైన, మరో ఐదుగురిపైన కేసు నమోదైంది.

ఆ కోడ్ ఉల్లంఘన కేసులో బాలయ్యతో పాటు మిగతా నిందితులు కోర్టుకు హాజరు కావడం లేదు. ముందస్తు బెయిల్ ఉందనే సాకుతో వారు కోర్టుకు హాజరు కావడాన్ని దాటవేస్తూ వస్తున్నారు. దీంతో కోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22వ తేదీన హాజరు కాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు బాలయ్యను హెచ్చరించింది. ఈ కేసు నమోదైనవారిలో తెలుగుదేశం నాయకులు సతీష్ రెడ్డి, పాలెం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X