వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అది పోలీస్ కమిషనర్ వైఫల్యమే
ముంబయి: ముంబయి టెర్రరిస్టుల దాడుల (26/11)కేసులో రామ్ప్రధాన్ కమిటీ ప్రస్దావిస్తున్న అంశాలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఈ దాడులు నగర పోలీస్ కమిషనర్ హసన్ గఫూర్ వైఫల్యం వల్లే జరిగాయని తేల్చి చెప్పింది. దీంతో ముంబయి ప్రభుత్వం ఆయనను స్థాన చలనం చేసేందుకు సమాయత్తమవుతుంది. ఈ పోస్ట్ కోసం పూనె పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి డి. శివనందన్, అడిషనల్ డైరెక్టర్ జనరల్( లా అండ్ ఆర్డర్) సంజీవ్ దయాల్లు పోటీలో ఉన్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం టెర్రరిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అధికారి కోసం అన్వేషిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Story first published: Sunday, June 7, 2009, 16:36 [IST]