హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేప మందుకు వైయస్ శ్రీకారం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రజలకు చేప మందు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం ప్రారంభించారు. మృగశిర కార్తె తొలి రోజు హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన బత్తిన సోదరులు ప్రజలకు చేప మందు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. చేప మందును తీసుకోవడానికి దేశ, విదేశాల నుంచి వేలాది మంది ఎగ్జిబిషన్ మైదానానికి తరలి వచ్చారు. హైదరాబాదులో ఉగ్రవాదుల దాడులు జరగవచ్చుననే హెచ్చరికల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చేప మందు ఇచ్చే కార్యక్రమాన్ని బత్తిన సోదరులు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు.

చేపమందును జన విజ్ఞాన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానికి శాస్త్రీయత లేదని సమితి ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దానివల్ల స్వైన్ ఫ్లూ వ్యాధి సోకే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అయితే వారి విమర్శలను బత్తిన సోదరులు ఖండిస్తున్నారు. తమ కుటుంబం 164 ఏళ్లుగా ఈ మందు ఇస్తోందని, తాము ఏమీ తీసుకోకుండానే ఈ మందు ఇస్తున్నామని వారంటున్నారు. మందుల కంపెనీలతో కుమ్మక్కయి జన విజ్ఞాన సమితి తమపై తప్పుడు ఆరోణలు చేస్తోందని వారంటున్నారు. అది జన అజ్ఞాన సమితి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X