డిపెప్ స్కామ్: మాలతికి ఆదేశాలు
హైదరాబాద్: అప్పట్లో సంచలనం సృష్టించిన డిపెప్ కుంభకోణంలో సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేసిన ఆర్ మాలతికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2005, 2006ల్లో ఆమె సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేశారు. ఆమె సర్వశిక్షా అభియాన్ కోశాధికారిగానూ అకౌంటెంటుగానూ పనిచేశారు. నిధుల లెక్కలు చెప్పకపోవడంపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మాలతిని ఆదేశించింది.
మాలతి ఆరు చెక్కుల ద్వారా బ్యాంకుల నుంచి నిధులు విత్ డ్రా చేశారు. అయితే వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. వాటిని ఎక్కడా లెక్కల్లో చూపలేదు. దీంతో ఉద్దేశ్యపూర్వకంగానే మాలతి ఆ డబ్బులను డ్రా చేశారని, వాటికి సంబంధించిన రశీదులను ఇస్తూ పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మాలతిని ఆదేశించింది. డిపెప్ కుంభకోణంలో సరసాదేవి పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.
Comments
Story first published: Tuesday, June 9, 2009, 10:20 [IST]