వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధైర్యం చూపండి: పాక్ కు పిఎం సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: భారత్ లో నేరాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునేందుకు ధైర్యం ప్రదర్శించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ కు సూచించారు. ఉగ్రవాదం పట్ల తాము ఏ మాత్రం ఉదాసీనతను ప్రదర్శించబోమని ఆయన అన్నారు. భారత్ పై దాడులకు తమ దేశాన్ని వేదికగా మార్చుకోకుండా పాకిస్తాన్ బలమైన, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన మంగళవారం పార్లమెంటులో అన్నారు. గతంలో భారత్ లో నేరాలకు పాల్పడినవారిపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అటువంటి చర్యలను ఉభయ దేశాల ప్రజలు హర్షిస్తారని ఆయన అన్నారు.

తమిళ టైగర్లు ఓడిపోయిన నేపథ్యంలో తమిళ ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి ముందుకు రావాలని ఆయన శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని ప్రజల మేలే తమకు కావాల్సిందని ఆయన అన్నారు. తమిళుల సమస్య ఎల్టీటిఇ కన్నా పెద్దదని ఆయన అన్నారు. సమాన పౌరులుగా, హుందాగా, గౌరవప్రదంగా తమిళ జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X