సబితకు సత్యంబాబు తల్లి విజ్ఞప్తి
హైదరాబాద్: విజయవాడలో విద్యార్థిని ఆయేషా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆ కేసులో నిందితుడు సత్యంబాబు తల్లి మరియమ్మ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. శుక్రవారం ఉదయం ఆమె దళిత సంఘాల ప్రతినిధులతో కలిసి హోమంత్రిని ఆమె నివాసంలో కలిశారు. తాము, ఆయేషా తల్లిదండ్రులు కూడా ఈ హత్యలో సత్యంబాబు పాత్ర లేదని అంటున్నా పోలీసులు వినటం లేదని ఆమె ఫిర్యాదుచేసింది.
దీనిపై మంత్రిమండలిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి వారికి హామీ ఇచ్చారు. సత్యంబాబు ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేదు. అతను వ్యాధితో బాధపడుతున్నాడు. అయేషా హత్య కేసులో సత్యంబాబు పాత్ర లేదని అయేషా తల్లిదండ్రులు అంటున్నారు. మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడి పాత్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు.
Story first published: Friday, June 12, 2009, 13:50 [IST]