హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం పదవిపై చిరుకు డిఎస్ సలహా

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్‌: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం మంచి పరిణామమేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. పొత్తులపై తీసుకునే నిర్ణయాన్ని బట్టే ప్రజారాజ్యం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. తెలుగుదేశంతో కలిసి వెళ్లాలనుకుంటే ముఖ్యమంత్రి ఎవరు అనేది ముందే నిర్ణయించుకోవాలని ఆయన చిరంజీవికి సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కు సొంత బలముందని చెప్పారు. ఇతర పార్టీలను ఆహ్వానించాల్సిన అవసరం లేదంటూనే పొత్తులపై నిర్ణయించేది తానొక్కడినే కాదని, ఎన్నికలొచ్చినప్పుడు ముఖ్యమంత్రి, ఏఐసీసీతో చర్చించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఎన్నికల్లో ఓడిపోయారంటూ తెలుగుదేశం నేతలు చేస్తున్న విమర్శలపై డీఎస్‌ స్పందిస్తూ..ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ కూడా గతంలో ఒక చోట ఓడిపోయారని, దానికేం చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమని, రాజకీయాల్లో చలామణి కావడమంటే మజాకా? అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి, తాను వేర్వేరు కాదని చెప్పారు. 'ప్రభుత్వ పనులు, సమీక్షలు ముఖ్యమంత్రి చేస్తే..పార్టీ సమీక్షలు, ఇతర విషయాల్లో నా పని నేను చేసుకుంటా. ఏం చేసినా ఇద్దరం చెప్పుకుంటాం' అని వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X