ప్రేమ బలి: సమీరా చనిపోయింది
పాల వ్యాపారం చేస్తున్న అర్షాద్ వద్ద నుంచి రూ.15 వేలు అప్పు తీసుకున్నట్లు సమీరా తల్లిదండ్రులు మహ్మద్ యూసఫ్, ఖుర్షిదా బేగంలు పోలీసులకు తెలిపారు. "రోజుకు రూ.200 చొప్పున ఇంతవరకూ రూ.5 వేలు చెల్లించాం. సమీరా రోజూ వెళ్లి అర్షాద్కు డబ్బులిచ్చి వచ్చేది. అయితే మన బస్తీకి చెందిన ఎవరో అమ్మాయి చార్మినార్ పైనుంచి పడిపోయిందంటూ గురువారం రాత్రి 7.30 సమయంలో అర్షాద్ స్వయంగా వచ్చి చెప్పి రూ.200 తీసుకొని వెళ్లిపోయాడు" అంటూ సమీరా తల్లి విలపించింది. కపట ప్రేమతో తమ బిడ్డను వంచించి పొట్టన పెట్టుకున్నాడంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్షాద్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. శనివారం శవపరీక్ష నిర్వహించి సమీరా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Comments
Story first published: Saturday, June 13, 2009, 10:00 [IST]