హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ బలి: సమీరా చనిపోయింది

By Staff
|
Google Oneindia TeluguNews

Sameera
హైదరాబాద్‌: తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమీరా శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. గురువారం సాయంత్రం తలాబ్‌ కట్టకు చెందిన పాలవ్యాపారి అర్షాద్‌, అదే ప్రాంతానికి చెందిన సమీరా బేగంను చార్మినార్‌ మొదటి అంతస్తు నుంచి కిందకు తోసిన సంఘటన సంచలనం సృష్టించింది. మెరుగైన వైద్యం అందించినా ప్రయోజనం లేకపోయిందని, 72 అడుగుల ఎత్తు నుంచి కిందపడటం వల్ల రెండు కాళ్లు విరగడంతో పాటు మెదడు, మూత్రపిండాలు బాగా దెబ్బతిన్నట్లు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. మానసికంగా షాక్‌ కు గురవడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. నిందితుడితో పాటు అతడి సోదరులు కౌసర్‌, హజీలను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అర్షాద్‌ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుంటున్నట్లు చార్మినార్‌ ఏసీపీ బాబూరావు తెలిపారు.

పాల వ్యాపారం చేస్తున్న అర్షాద్‌ వద్ద నుంచి రూ.15 వేలు అప్పు తీసుకున్నట్లు సమీరా తల్లిదండ్రులు మహ్మద్‌ యూసఫ్‌, ఖుర్షిదా బేగంలు పోలీసులకు తెలిపారు. "రోజుకు రూ.200 చొప్పున ఇంతవరకూ రూ.5 వేలు చెల్లించాం. సమీరా రోజూ వెళ్లి అర్షాద్‌కు డబ్బులిచ్చి వచ్చేది. అయితే మన బస్తీకి చెందిన ఎవరో అమ్మాయి చార్మినార్‌ పైనుంచి పడిపోయిందంటూ గురువారం రాత్రి 7.30 సమయంలో అర్షాద్‌ స్వయంగా వచ్చి చెప్పి రూ.200 తీసుకొని వెళ్లిపోయాడు" అంటూ సమీరా తల్లి విలపించింది. కపట ప్రేమతో తమ బిడ్డను వంచించి పొట్టన పెట్టుకున్నాడంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్షాద్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. శనివారం శవపరీక్ష నిర్వహించి సమీరా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X