వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అఫీసులను పేల్చేసిన మావోయిస్టులు
గయ: ఎన్ కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు జరుపుతున్న విధ్వంసాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీహార్ లోని గయ జిల్లా చక్రబండ గ్రామంలో ఓ కమ్యూనిటీ సెంటర్ ను, ప్రభుత్వ పాఠశాల భవనాన్ని, పంచాయతీ కార్యాలయం భవనాన్ని వారు పేల్చివేశారు. 100 మంది మావోయిస్టులు గ్రామాన్ని చుట్టుముట్టి డైనమైట్లతో పేల్చివేశారు. ఈ సంఘటన తెల్లవారుజామున జరగటంతో భవనంలో ఎవరూ లేరని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మగధ రేంజి డిఐజీ నీలేకర్ తెలిపారు.
Comments
Story first published: Monday, June 15, 2009, 14:47 [IST]