పట్టపగలు నగల షాపులో చోరీ
హైదరాబాద్: నేరేడ్ మెట్లోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. ఇక్కడి మాతేశ్వరి నగర దుకాణంలోకి కొనేందుకు వచ్చినట్లు నటిస్తూ కొందరు వచ్చారు. రాగానే దుకాణం, యజమానిని, సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. యజమాని నోట్లో గుడ్బలు కుక్కి 50 లక్షల రూపాయల విలువైన నగలు దోచుకుని వెళ్ళారు. ఉదయం తొమ్మిదింటికే దుకాణం తెరిచిన వెంటనే ముగ్గురు దుండగులు వచ్చి సిబ్బందిని తుపాకులతో బెదిరించి నగలు దోచుకెళ్ళిపోయారు. దుండగులు మూడు రోజుల క్రితం ఒక ఉంగరం కొనుక్కుని "రెక్కీ" చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు.
Comments
Story first published: Tuesday, June 16, 2009, 11:24 [IST]