వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీపై మాయ వ్యాఖ్యలకు నిరసన

By Staff
|
Google Oneindia TeluguNews

Mayawati
లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరసనలు రేకెత్తిస్తున్నాయి. యూపీలో తమ పార్టీ ప్రాభవం తగ్గి కాంగ్రెస్‌ కు గతంలోకంటే ఓట్లు, సీట్లు బాగా పెరగటంపై మాయావతి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీన్నంతా ఆమె రాహుల్‌ గాంధీ పుట్టినరోజునాడు వెళ్లగక్కారు.

ఆయన పుట్టినరోజును సామాజిక న్యాయ, సామరస్యతా దివస్‌గా కాంగ్రెస్‌ ప్రకటించి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. దీనిపై తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాయావతి విరుచుకుపడ్డారు. ఆ పేరుతో దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి అనంతరం రాహుల్‌ ఢిల్లీలో తన చేతులను సబ్బుతో కడుక్కుంటారని ఆమె అన్నారు. ఇలాంటి నాటకాలను మహాత్మగాంధీ తన జీవితపర్యంతం ఆడారని, వీటిని దళితులు నమ్మరని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గాంధీని కించపరిచినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని లేదా ఉద్యమం చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి సుభోద్‌ శ్రీవాస్తవ హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X