వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాంధీపై మాయ వ్యాఖ్యలకు నిరసన
ఆయన పుట్టినరోజును సామాజిక న్యాయ, సామరస్యతా దివస్గా కాంగ్రెస్ ప్రకటించి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. దీనిపై తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాయావతి విరుచుకుపడ్డారు. ఆ పేరుతో దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి అనంతరం రాహుల్ ఢిల్లీలో తన చేతులను సబ్బుతో కడుక్కుంటారని ఆమె అన్నారు. ఇలాంటి నాటకాలను మహాత్మగాంధీ తన జీవితపర్యంతం ఆడారని, వీటిని దళితులు నమ్మరని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గాంధీని కించపరిచినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని లేదా ఉద్యమం చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి సుభోద్ శ్రీవాస్తవ హెచ్చరించారు.
Comments
మాయావతి లక్నో congress కాంగ్రెస్ rahul gandhi ఉత్తరప్రదేశ్ mahatma gandhi రాహుల్ గాంధీ mayawati మహాత్మా గాంధీ
Story first published: Tuesday, June 16, 2009, 11:46 [IST]