హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముదిరిన డిజిపి లేఖల వివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

SSP Yadav
హైదరాబాద్: లేఖల వివాదంలో చిక్కుకున్న డిజిపి యాదవ్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి పిలిపించి మాట్లాడారు. పోలీస్‌ అధికారి, ఎన్నికల అధికారి లేఖల వివాదం ముదురుతున్నట్లుంది. ఎన్నికల సందర్భంగా డిజిపి యాదవ్‌ కర్నూలులో చేసిన వ్యాఖ్యల వల్ల అతనిని ఎన్నికల విధుల నుంచి తొలగించారు.

ఈ విషయమై పూర్తి వివరాలు తనకు తెలియజేయమని ఆయన ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి, (చీఫ్‌ ఎలక్టొరల్‌ ఆఫీసర్‌ (సిఇఓ)) డాక్టర్‌ ఐ.వి.సుబ్బారావుకు లేఖ వెంట లేఖ మూడు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఐ.వి. సుబ్బారావు ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత రెడ్డిని కలిశారు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి యాదవ్‌ని పిలిపించారు. ప్రధాన కార్యదర్శిని డిజిపి కలిశారు.

ఈ విషయాన్ని తాను పెద్దిది చేయదలచుకోలేదని పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపానని ఐ.వి.సుబ్బారావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X