వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాపై కెసీఅర్ కొడుకు లొల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

K Taraka Ramarao
కరీంనగర్: "టీఆర్‌ ఎస్‌ లో ఏదో జరిగిపోతోందని, ఆ పార్టీ ఆరిపోతోందని చెప్పే ప్రయత్నాన్ని మీడియా చేస్తోంది. అసమ్మతి నేతలను ప్రోత్సహిస్తోంది. చోటా మోటా నాయకులను పదేపదే ప్రసారం చేస్తోంది. వారి వ్యాఖ్యానాలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని మలినం చేస్తోంది" అని కెసీఆర్ కుమారుడు, టీఆర్‌ ఎస్‌ ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారమిక్కడ మండిపడ్డారు.

విజయశాంతి, హరీశ్‌ రావుల తర్వాత..తాజాగా మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ కుట్రలకు బలికావద్దని, సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, పత్రికలకు ఎక్కవద్దని పార్టీ నేతలకు హితవు పలికారు. ఎలుకలు ఉంటే ఇల్లు తగులబెట్టుకోరని, అలాగే సమస్యలు ఉంటే ఉద్యమాన్ని నాశనం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్‌ విసిరిన వలలో పడినవారే..ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో అసమ్మతి నేతలుగా మారి టీఆర్‌ ఎస్‌ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X