వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
కడప: కడప జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. టాటా సుమోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘోరం సంభవించింది.
ప్రమాదంలో టాటా సుమోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లారీ డ్రైవర్ నిద్రమత్తుతో వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Thursday, June 18, 2009, 11:21 [IST]