అల్లు అరవింద్ కు కోర్టు నోటీసు
ఆ సినిమా విడుదలకు ముందు చంద్రశేఖర్ హైకోర్టులో కేసు వేశారు. తన అనుమతి లేకుండా కథను అరవింద్ తస్కరించారని, ఆ కథా నేపథ్యంతో హిందీలో సినిమా రూపొందించారని, తనకు పరిహారం ఇవ్వనందున సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు రూ.56 కోట్లు డిపాజిట్ చేసి, చిత్రాన్ని విడుదల చేసుకోవాలని అరవింద్ కు సూచించింది.
ఆ మేరకు కోర్టులో డిపాజిట్ చేసిన అరవింద్ గజిని సినిమాను విడుదల చేశారు. తర్వాత కేసు తేలేవరకు డిపాజిట్ డబ్బును చంద్రశేఖర్ కు ఇవ్వరాదని అరవింద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దేశ, విదేశాల్లో విడుదలైన హిందీ గజిని రూ.230 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్ ఇటీవల హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
అరవింద్ బావ చిరంజీవి పార్టీ స్థాపించి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశారని, గజిని వసూళ్ల సొమ్మును ఎన్నికల కోసం ఖర్చుచేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. తన కేసు విచారణ తేలే వరకు ఆ డబ్బునంతా తిరిగి కోర్టులో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపైనే అరవింద్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది.