హిమాచల్ లో బ్రిటిష్ టీనేజర్ పై అత్యాచారం
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో బ్రిటిష్ జాతీయురాలిపై అత్యాచారం జరిగినట్లు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.బ్రిటిష్ జాతీయురాలు జియాంగ్ విల్సన్ ను ఇద్దరు టాక్సీ డ్రైవర్లు పాలంపూరులోని కేఫ్ వద్ద రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఆ 18 ఏళ్ల బాలిక లోడెక్స్ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెబుతోంది. ఎక్స్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా పది వారాల పాటు భారతదేశంలోని పేద పిల్లలకు పాఠాలు చెప్పడానికి విల్సన్ ఇంగ్లాండు నుంచి ఇక్కడికి వచ్చింది. కేఫ్ దగ్గర ఆ బాలిక షాపింగ్ కు వెళ్లినట్లు, ఆ సమయంలో ఇద్దరు టాక్సీలో లిఫ్ట్ ఇస్తానని చెప్పినట్లు, టాక్సీలో ఎక్కిన తర్వాత జన సంచారం లేని చోటికి తీసికెళ్లి ఆ బాలికపై అత్యాచారం జరిపినట్లు సమాచారం. వైద్యులు పరీక్షలు జరిపి నివేదికను పోలీసులకు అందజేశారు.