దేవుడి సొమ్ము తింటే ఇబ్బందులు: వైయస్
తిరుమల వేంకటేశ్వర దేవాలయ నిర్వహణ తీరు బేషుగ్గా ఉందని ఆయన మెచ్చుకున్నారు. ఆలయాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. 3 వేలకు పైగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ ఉద్యోగులకు కూడా అన్ని వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 4 లక్షల 33 వేల ఎకరాల ఆలయ భూముల నుంచి ఆదాయం రావడం లేదని ఆయన చెప్పారు. ఆలయ భూములను కబ్జా చేయడానికి వివిధ మార్గాల్లో వస్తారని, వారిని అడ్డగించాలని, ఏ విషయంలోనూ అధికారులు ఆశ్రిత పక్షపాతం చూపకూడదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Story first published: Monday, June 22, 2009, 11:19 [IST]