వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెన్త్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రద్దు: సిబాల్

By Staff
|
Google Oneindia TeluguNews

Kapil Sibal
న్యూఢిల్లీ: పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ చెప్పారు. టెన్త్‌ చదివే పిల్లలు ఇంట్లో ఉంటే ఇక ఆ ఇంట్లో చేసే హంగామా, చెందే ఆందోళన గురించి చెప్పనక్కర్లేదు. విద్యాసంవత్సరం మొదటినుంచే తల్లిదండ్రులు, పిల్లలు ఏదో ఉత్పాతం ముంచుకురాబోతున్నట్లు టెన్షన్‌ తో ఉంటారు. పరీక్షల సమయంలో అయితే ఇక అందరి కంగారు చెప్పనవసరం లేదు.ఇక ఆ ఇబ్బందులన్ని తొలగిపోతాయి.

విద్యారంగంలో సంస్కరణలకోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన యశ్‌ పాల్‌ కమిటీ తన నివేదికలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్న టెన్త్‌ పరీక్షలను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. దీన్ని త్వరలో అమలుచేయాలని భావిస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ తెలిపారు. పిల్లలను మానసిక ఒత్తిడినుంచి విముక్తం చేయటమే దీని లక్ష్యమన్నారు. టెన్త్‌ లో పర్సంటేజీలు మాత్రమే ఇస్తారని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X