తలసానిపై క్రమశిక్షణా చర్య?
తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంపై చంద్రబాబు గురువారం సాయంత్రం పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణా సంఘం సమావేశమై శ్రీనివాస యాదవ్ పై చర్యకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం నాయకుడు తీగెల కృష్ణా రెడ్డి తలసాని విమర్శల వెనక కాంగ్రెసు కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఈ స్థితిలో ఆయనకు నచ్చజెప్పినా ఫలితం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది.
శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెసులో చేరుతున్నట్లు తనకు ఏ విధమైన సమాచారం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గుంటూరులో అన్నారు. ఆ విషయంపై తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు. అయితే, తలసానికి కాంగ్రెసుకు ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
Comments
hyderabad హైదరాబాద్ tdp chandrababu చంద్రబాబు congress కాంగ్రెస్ శ్రీనివాస్ టిడిపి krishna reddy talasani srinivas yadav తలసాని శ్రీనివాస యాదవ్
Story first published: Thursday, June 25, 2009, 15:17 [IST]